హీరోయిన్స్ ఫొటోలను మార్ఫింగ్ చేయడం, అసభ్యపదజాలాలతో పోస్ట్లు పెట్టడం సోషల్ మీడియాలో కామన అయిపోయింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ వచ్చిన తర్వాత హీరోయిన్స్ ఫొటోలను మార్ఫింగ్ చేయడం, అసభ్యపదజాలాలతో పోస్ట్లు పెట్టడం సోషల్ మీడియాలోపెరిగిపోయింది. తాజాగా ఈ విషయంపై జాన్వీ కపూర్ మాట్లాడుతూ ‘‘నేను, చెల్లి ఏ ఫంక్షనకు వెళ్లినా అనుమతి లేకుండా మా ఫొటోలు తీసేవారు. వద్దని వారించిని వినేవారు కాదు. అలాగని గట్టిగా మాట్లాడితే.. మీడియాపై ఫైర్ అయిన శ్రీదేవి కూతురు’ అని అదొక తలనొప్పి. అయితే కొన్నాళ్లకు అది మాకు అలవాటైపోయింది. పదేళ్ల వయసులో ఎవరో నా ఫొటో తీసి కాబోయే హీరోయిన్ అంటూ వెబ్సైట్స్లో పెట్టారు. అది చూసిన తర్వాత చాలామంది స్నేహితులు దూరమయ్యారు. ఆ తర్వాత నా టీనేజ్ ఫొటో తీసి మార్ఫింగ్ చేసి పోర్న్సైట్స్లో పెట్టారు. ఇలాంటి చూసి చాలా బాధపడేదాన్ని. ఏఐతో అందుబాటులోకి రావడంతో ప్రస్తుతం ఈ సమస్య మరింత పెరిగింది. చాలామంది ఆడపిల్లలు ఈ సమస్యలు ఎదుర్కొంటున్నారు. పోర్న్ సైట్స్లో మార్ఫింగ్ ఫొటోలు చూసి చాలామంది అదే నిజమని నమ్ముతున్నారు. ఇలాంటి విషయాలు కుటుంబ సభ్యులకు తెలిస్తే వారి మనసు ఎంతో నొచ్చుకుంటుంది. ఇలాంటి విషయంతెలిసినప్పుడు నాకు చాలా ఆందోళనగా ఉంటుంది’’ అని జాన్వీకపూర్ చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa