బాలీవుడ్ స్టార్స్ అర్జున్ కపూర్, మలైకా ఆరోరా చాలా రోజులుగా రిలేషన్ షిప్లో ఉన్నారని వార్తలు వింటూనే ఉన్నాం. తాజాగా ఈ జంట ముంబైలో ఓ ఇంటిని కొనుగోలు చేసినట్టు వార్తలు వచ్చాయి. లోఖండ్ వాలా కాంప్లెక్స్ లో అపార్ట్ మెంట్ తీసుకున్న మలైకా, అర్జున్ జంట త్వరలోనే ఆ ఇంట్లోకి అడుగుపెట్టనున్నారని అన్నారు. అయితే బాలీవుడ్ మీడియా ప్రకారం ఈ జంట ఏప్రిల్ (19, 2019)న చర్చిలో పెళ్లి చేసుకోబోతున్నారట. ఈ పెళ్లికి పరిమిత సంఖ్యలో అతిథులు, బంధువులు హాజరవుతారట. ఇప్పటికే ఈ పెళ్లికి ఏర్పాటు పూర్తయ్యాయని అంటున్నారు.
మలైకా అరోరా 1998లో అర్భాజ్ ఖాన్ని ప్రేమ వివాహం చేసుకుంది. వీరికి 15 ఏళ్ళ కుమారుడు కూడా ఉన్నారు. కొన్నాళ్ళుగా వీరి మధ్య వచ్చిన గొడవల వలన 2016 నవంబర్ లో కోర్టు మెట్లెక్కారు. కౌన్సిలింగ్ తో వారి నిర్ణయాన్ని మార్చుదామని కోర్టు ప్రయత్నించిన ఉపయోగం లేకుండా పోయింది. దీంతో మే (17,2017)న బాంద్రా ఫ్యామిలీ కోర్టు వీరి వివాహ బంధానికి శాశ్వతంగా బ్రేక్ వేసింది.
కుమారుడి సంరక్షణ బాధ్యతలను మలైకా కి అప్పగించగా, బాబుతో సరదాగా గడిపే సమయం వెచ్చించేందుకు అర్బాజ్ కి కోర్టు అనుమతినిచ్చింది. అయితే అర్బాజ్, మలైకాకి గొడవ రావడానికి కారణం బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్ అని అప్పట్లో పుకార్లు షికారు చేశాయి. అర్జున్ కపూర్ ప్రస్తుతం అశుతోష్ గోవరికర్ పీరియడ్ డ్రామా పానిపట్ చిత్రం చేస్తున్నాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa