వెండితెరపై ఓ వెలుగు వెలిగిన తార శ్రీదేవి. ప్రేక్షకులకు ఆమె అతిలోక సుందరి. ఇప్పటికీ శ్రీదేవి అంటే ఆ క్రేజే వేరు. ఇప్పుడు ఆమె వారసురాలిగా కూతురు జాన్వీ కపూర్ వెండితెర ఎంట్రీకి రెడీ అవుతుంది. జాన్వీ ఎంట్రీ కోసం గ్రౌండ్ వర్క్ చేసింది శ్రీదేవి. ఆ బాధ్యతను బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ కి ఇచ్చింది. అయితే ఇప్పుడు కరణ్ పై కోపంగా వుందట శ్రీదేవి.
స్టార్కిడ్స్కి తన సినిమాల్లో అవకాశం ఇవ్వడంలో కరణ్ ముందుంటాడు. ఆలియా భట్కి కెరీర్లో సాయపడినట్లే.. జాన్వికి కూడా సాయం చేయాలని శ్రీదేవి కరణ్ని కోరింది. ఆయన ఓకే అన్నాడు. అయితే ఎందులో డిలే అవుతుంది. ఆలియా భట్ కొత్త సినిమా గురించి కరణ్ ఎప్పటికప్పుడు ట్వీట్లతో అప్డేట్లు ఇస్తుంటాడు. కానీ జాన్వి విషయం పక్కన పెట్టేశాడు కరణ్. దీంతో కరణ్ పై అసహనంగా వుందట శ్రీదేవి. అనుకుంటే.. శ్రీదేవినే సొంతగా ఒక సినిమా నిర్మించగలదు. కానీ ఎందుకో కరణ్ జోహార్ కరెక్ట్ అవుతుందని ఫీల్ అవుతుంది శ్రీదేవి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa