కొంచెం చూసుకో, ఆ చిత్రం చేయొద్దు.. పూరి జగన్నాధ్ ని హెచ్చరించిన ఆర్జీవీ, కట్ చేస్తే సూపర్ హిట్ ఒక చిత్రం విషయంలో రామ్ గోపాల్ వర్మ.. పూరి జగన్నాధ్ ని హెచ్చరించారు. ఈ చిత్రం చేయొద్దు.. ఒకసారి చూసుకో అని వార్నింగ్ ఇచ్చారట.డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ కి స్టార్ హీరోల రేంజ్ లో ఫ్యాన్స్ ఉన్నారు. పూరి జగన్నాధ్ తెరకెక్కించిన చిత్రాలు కావచ్చు, తెరకెక్కించిన విధానం కావచ్చు, ఆయన బిహేవియర్ కావచ్చు.. కారణం ఏదైనా పూరి విశేషంగా అభిమానులని సొంతం చేసుకున్నారు. పూరి జగన్నాధ్ కి నిర్మాతల ఫ్రెండ్లీ డైరెక్టర్ అనే ఇమేజ్ ఉంది. తాజాగా పూరి జగన్నాధ్ నుంచి వచ్చిన డబుల్ ఇస్మార్ట్ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ చిత్రానికి మిక్స్డ్ రెస్పాన్స్ వస్తోంది. అయితే పూరి జగన్నాధ్ గత చిత్రాల గురించి విశేషాలు వైరల్ అవుతున్నాయి. పూరి జగన్నాధ్ మేకింగ్ స్టైల్ కి రామ్ గోపాల్ వర్మ, వివి వినాయక్ లాంటి దర్శకులు అభిమానులుగా ఉన్నారు. ముఖ్యంగా ఆర్జీవీకి పూరి అంటే చాలా ఇష్టం. తాను సిద్ధం చేసే కథలని పూరి వర్మతో షేర్ చేస్తుంటారట. అయితే ఒక చిత్రం విషయంలో రామ్ గోపాల్ వర్మ.. పూరి జగన్నాధ్ ని హెచ్చరించారు. ఈ చిత్రం చేయొద్దు.. ఒకసారి చూసుకో అని వార్నింగ్ ఇచ్చారట. ఆ సినిమా ఏదో కాదు.. సూపర్ స్టార్ మహేష్ బాబుతో పోకిరి లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత తెరకెక్కించిన బిజినెస్ మాన్ చిత్రం. మహేష్ బాబుతో సినిమా ఒకే అయింది. 70 రోజుల్లోనే షూటింగ్ పూర్తవుతుంది. షూటింగ్ ప్రారంభం కాకముందే రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేశాం అని పూరి జగన్నాధ్ వర్మకి చెప్పారట. అయితే కథ విన్న రామ్ గోపాల్ వర్మ.. నువ్వు పక్కాగా ఉన్నావా.. దయచేసి కంగారు పడి ఈ చిత్రాన్ని చేయొద్దు. కాస్త చెక్ చేసుకో అని సలహా ఇచ్చారట. ఎందుకంటే వర్మకి ఈ చిత్రం హిట్ అవుతుందనే నమ్మకం లేదట. కానీ పూరి మాత్రం కాన్ఫిడెన్స్ తో ముందుకు వెళ్లి ముందుగా అనుకున్నట్లుగానే 70 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసి సూపర్ హిట్ కొట్టారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa