ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అడవి శేష్ సైలెంటుగా 'ఎవరు' ని కంప్లీట్ చేశాడే !

cinema |  Suryaa Desk  | Published : Mon, Jun 03, 2019, 04:07 PM

క్షణం, గూఢచారి వంటి విభిన్న చిత్రాలలో నటించి మంచి విజయాలు అందుకున్నారు హీరో అడవి శేషు. తన తదుపరి మూవీ వివరాలు నేడు ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు ఆయన. “ఎవరు” అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ ని ఈ మూవీకి పెట్టారు. వెంకట్ రాంజీ దర్శకత్వంలో సస్పెన్సు థ్రిల్లర్ గా ఈమూవీ తెరకెక్కుతుంది.


సినిమాపై ఆసక్తిని పెంచడానికి ఈ సినిమా షూటింగ్ రహస్యంగా మీడియా కి సమాచారం లేకుండా పూర్తి చేసారంట. అడవి శేషుకి సరసన హీరోయిన్ గా రెజీనా కాసాండ్రా చేస్తున్న ఈ మూవీలో నవీన్, మురళి శర్మ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. అన్ని కారక్యమాలు పూర్తిచేసి ఆగస్టు 23న విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు చిత్ర యూనిట్.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa