వి.విజయలక్ష్మి సమర్పణలో శివ మహాతేజ ఫిలిమ్స్ పతాకంపై వి.సముద్ర దర్శకత్వంలో వి.సాయి అరుణ్ కుమార్ నిర్మిస్తున్న చిత్రం 'జై సేన'. శ్రీకాంత్, సునీల్, శ్రీ, పృథ్వీ, ప్రవీణ్, కార్తికేయ ప్రధాన తారాగణంగా నటిస్తున్నారు. గురువారం ఈ సినిమా టైటిల్పోస్టర్ను, మోషన్ పోస్టర్ను హైదరాబాద్లో విడుదల చేశారు. నటుడు సునీల్ లోగోను విడుదల చేశారు. ఈ సందర్భంగా.. దర్శకుడు వి.సముద్ర మాట్లాడుతూ - ''ఈ చిత్రంలో శ్రీకాంత్, సునీల్తో పాటు నలుగురు కొత్త హీరోలను పరిచయం చేస్తున్నాను. షూటింగ్ పూర్తయ్యింది. ప్యాచ్ వర్క్ మిగిలి ఉంది. పదికాలాల పాటు నిలిచిపోయేలా మంచి సినిమాలు తీయాలనే శివమహాతేజ ఫిలింస్ బ్యానర్ను స్థాపించాం. ఇందులో తొలి ప్రయత్నంగా చేస్తున్న సినిమా ఇది'' అన్నారు.
'జై సేన' అనే టైటిల్ ఎందుకు పెట్టారని విలేఖరులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా సముద్ర మాట్లాడుతూ ''పవన్కల్యాణ్ స్థాపించిన పార్టీ జనసేన ఆయన రాజకీయ ఆశయాలకు సంబంధించినది అయితే మా సినిమా 'జై సేన' ఆయన భావాలకు సంబంధించిన చిత్రం. అయితే ఆయన అభిమానంతో చేసే కొన్ని మంచి పనులను ఇందులో చూపిస్తున్నాం. నా ప్రతి సినిమాలో సామాజిక అంశాలున్నట్లే ఇందులో కూడా సోషల్ కాజ్ ఉంటుంది. మాకు మా యూనిట్కు చాలా మంచి పేరు తెచ్చే సినిమా అవుతుంది. రవిశంకర్ బ్రహ్మాండమైన పాటలను అందించారు. కో ప్రొడ్యూసర్ శిరీష్ రెడ్డిగారు అన్ని విషయాల్లో నాకు బ్యాక్బోన్లా నిలిచారు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాను వచ్చే నెలలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. అందరూ మా బ్యానర్ను.. ఇందులో పరిచయం అవుతున్న హీరోలను ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను'' అన్నారు.
సునీల్ మాట్లాడుతూ - ''ఈ సినిమాకు స్క్రిప్టే సూపర్స్టార్. నేను పరిచయం అయిన దగ్గర నుండి ఇప్పటి వరకు మారకుండా అలాగే ఉండే వ్యక్తుల్లో సముద్రగారు ఒకరు. ఆయనకు నేను సహకరించాను అనడం కంటే ఆయనే నాకు సపోర్ట్ ఇచ్చారని చెప్పవచ్చు. ఈ సినిమాలో చాలా మంచి పాత్ర చేశాను. ఇప్పటి వరకు కామెడి పాత్రలే ఎక్కువగా చేశాను. ఇందులోనాలోని వినోదంతోపాటు వైల్డ్ యాంగిల్ను కూడా చూస్తారు'' అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa