నేడు జాతీయ సినిమా దినోత్సవం సందర్భంగా సినిమా టిక్కెట్లపై మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా బంపర్ ఆఫర్ ప్రకటించింది. దేశంలోని మల్టీప్లెక్స్లో ఎక్కడైనా సరే రూ.99 రూపాయలకే సినిమా చూడవచ్చని ప్రకటించింది. దేశవ్యాప్తంగా దాదాపు 4వేలకు పైగా స్క్రీన్స్పై ఆఫర్ వర్తిస్తుందని తెలిపింది. ఐమ్యాక్స్, 4డీఎక్స్, రిక్లైనర్స్ వంటి ప్రీమియర్ కేటగిరీలకు ఇది వర్తించదని పేర్కొంది.ఈ ప్రత్యేకమైన రోజున.. బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న చిత్రాల విజయోత్సవాన్ని జరుపుకోవడానికి అన్ని వయసుల ప్రేక్షకులను ఒకే చోట చేర్చడానికి ఈ ఆఫర్ తీసుకొచ్చినట్లు సమాచారం.. ఈ విజయాన్ని సాధించడంలో సహకరించిన సినీ ప్రేక్షకులకు హృదయపూర్వక ధన్యవాదాలు అంటూ అసోసియేషన్ ఒక ప్రకటనలో తెలిపింది. జాతీయ సినిమా దినోత్సవం మూడవ ఎడిషన్ రెండు మునుపటి ఈవెంట్ల తర్వాత రికార్డు స్థాయిలో 6 మిలియన్ల మంది ప్రజలు ఇక్కడికి హాజరయ్యారు. ముఖ్యంగా చలనచిత్ర ప్రేమికులు సెప్టెంబర్ 20వ తేదీని ఎంచుకోవడానికి కూడా అనేక ఎంపికలు ఉన్నాయని సమాచారం. ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సీక్వెల్స్ తో పాటు టైం లెస్ క్లాసిక్ మూవీలు, రీ రిలీజ్ మూవీలు కూడా ఉన్నాయి. కొత్తగా విడుదలైన చిత్రాలలో ఎన్నో చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా తెలుగువారికి సరిపోదా శనివారం, మత్తు వదలర 2 చిత్రాలు కూడా ఇదే ధరకి లభించబోతున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa