దేవి శరన్నవరాత్రులు ప్రారంభమయ్యాయి. దేశం మొత్తం ఇప్పుడు ఎక్కడ చూసిన అమ్మవారి అద్భుతరూపం దర్శనమిస్తుంది. ఈ నవరాత్రులలో అమ్మవారిని వివిధ రూపాలలో పూజించడం సంప్రదాయం. మొదటిరోజు పసుపు రంగు పూలతో ఆరాధించింది హీరోయిన్ ప్రణీత.పండుగలతోపాటు రంగులకు ఉన్న అనుబంధం తనకు చాలా ఇష్టమని చెప్పుకొచ్చింది. నవరాత్రి ఉత్సవాలను ప్రారంభించడానికి పసుపు రంగు తనకు సరైన మార్గంగా భావించానని.. అందుకే తాను పసుపు రంగు చీరను ధరించడం సంతోషంగా ఉందని తెలిపింది.తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది ప్రణీత సుభాష్. బావ తో కథానాయికగా ప్రేక్షకులకు పరిచయమైన ఈ బ్యూటీ.. అత్తారింటికి దారేది తో మరింత ఫేమస్ అయ్యింది.తెలుగుతోపాటు తమిళంలోనూ పలు చిత్రాల్లో నటించిన ప్రణీత.. బెంగుళూరుకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త నితిన్ రాజును వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరికి పాప, బాబు ఉన్నారు.సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే ప్రణీత.. తాజాగా పసుపు చీరకట్టులో మరింత అందంగా మెరిసిపోయింది. దేవి శరన్నవరాత్రులు పూజను ప్రారంభిస్తున్నట్లు చెప్పుకొచ్చింది
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa