తరుణ్, ఉదయ్ కిరణ్, సదా, ఆర్తి అగర్వాల్.. ఒకప్పటి టాలీవుడ్ సెన్సేషన్ స్టార్స్. ముఖ్యంగా ప్రేమ కథా చిత్రాలకు వీరు కేరాఫ్ అడ్రస్. తమ లతో యూత్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.తరుణ్, ఉదయ్ కిరణ్ లవర్ బాయ్స్ గా అప్పటి యూత్ కి ఫేవరేట్ హీరోలు అయితే, అమ్మాయిల కలల రాకుమారులు. ఇక సదా, ఆర్తి అగర్వాల్ అయితే ఇప్పటికీ చాలామందికి ఫేవరెట్ హీరోయిన్స్. దురదృష్టవశాత్తూ వీరిలో ఉదయ్ కిరణ్, ఆర్తి అగర్వాల్ మన మధ్య లేరు. ఇక తరుణ్, సదా ఇద్దరూ కూడా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. కాగా ఈ నలుగురు కలిసి దిగిన ఫొటో ఒకటి ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో తెగ చక్కర్లు కొడుతోంది. ఈ ఫొటో 2005లో తీసినట్టు తెలుస్తుంది. ఈ ఫొటోని క్లిక్ మనిపించిన ఒక సీనియర్ ఫొటోగ్రాఫర్ దీనిని సోషల్ మీడియాలో షేర్ చేయగా అది కాస్తా నెట్టింట వైరలవుతోంది. హైదరాబాద్ హుస్సేన్ సాగర్ లో బోట్ లో వీళ్లు కూర్చున్నప్పుడు తీసిన ఫొటో ఇది.2005 లో తరుణ్ - ఆర్తి అగర్వాల్ జంటగా సోగ్గాడు , ఉదయ్ కిరణ్ - సదా జంటగా ఔనన్నా కాదన్నా లు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. కేవలం వారం రోజుల వ్యవధిలో ఈ రెండు లు రిలీజయ్యాయి. ఈ ప్రమోషన్స్ లో భాగంగానే ఓ కార్యక్రమంలో వీరు హుస్సేన్ సాగర్ లో సందడి చేశారు. సరదాగా బోటులో షికారు చేశారు. ఈ ఫొటో ఇప్పుడు వైరల్ అవ్వడంతో సినీ అభిమానులు, నెటిజన్లు ఎమోషనల్ అవుతున్నారు. ముఖ్యంగా ఉదయ్ కిరణ్, ఆర్తి అగర్వాల్ ని గుర్తుచేసుకుంటూ భావోద్వేగానికి లోనవుతున్నారు. అలాగే తరుణ్, సదా మళ్లీ లు చేయాలని కోరుకుంటున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa