విడాకుల కేసు విచారణలో భాగంగా నటుడు ధనుష్, ఆయన భార్య ఐశ్వర్య చెన్నై ఫ్యామిలీ వెల్ఫేర్ కోర్టు ఎదుట హాజరయ్యారు. తాము కలిసి ఉండాలనుకోవడం లేదని.. విడిపోవాలని నిర్ణయించుకున్నామని న్యాయస్థానానికి తెలిపారు. ఆ సందర్భంగా వీరిద్దరూ విడిపోవడానికి గల కారణాలు చెప్పారు. ఇరువురి వాదనలు విన్న కోర్టు తుది తీర్పును ఈనెల 27కు వాయిదా వేసింది.తలైవా రజనీకాంత్ పెద్ద కుమార్తె ఐశ్వర్య ధనుష్ కంటే ఐశ్వర్య పెద్దదనే విషయం తెలిసిందే. చదువుకునే రోజుల్లో ధనుష్ వాళ్లక్క, ఐశ్వర్యకు మంచి స్నేహితురాలు. అలా, వీరిద్దరి మధ్య స్నేహం కుదిరింది. కొంతకాలానికి అది ప్రేమగా మారింది. పెద్దల అంగీకారంతో 2004 నవంబర్ 18న వీరి వివాహం జరిగింది. 18 ఏళ్ల వైవాహిక బంధానికి ఫుల్స్టాప్ పెడుతూ ఇద్దరూ విడిపోవాలనుకుంటున్నాం అని రెండేళ్ల క్రితం ధనుష్ - ఐశ్వర్య ప్రకటించారు. పరస్పర అంగీకారంతో తాము ఈ నిర్ణయం తీసుకున్నామని అప్పట్టోనే చెప్పారు. ‘‘18 ఏళ్లపాటు స్నేహితులుగా, భార్యభర్తలుగా, తల్లిదండ్రులుగా, శ్రేయోభిలాషులుగా అర్థం చేసుకొని మా ప్రయాణం కొనసాగించాం. ఇప్పుడు మేము వేర్వేరు దారుల్లో ప్రయాణించేందుకు సిద్థమయ్యాం. ఐశ్వర్య, నేనూ విడిపోవా?ని నిర్ణయం తీసుకున్నాం’’ అని 2022లో ధనుష్ పోస్ట్ పెట్టారు. విడాకుల కోసం ఈ ఏడాది ప్రారంభంలో చెన్నైలోని ఫ్యామిలీ వెల్ఫేర్ కోర్టును ఆశ్రయించారు. ఇప్పటికే పలుమార్లు ఈ కేసు విచారణకు రాగా.. వీరిద్దరూ హాజరుకాలేదు. దీంతో వీరిద్దరూ తిరిగి కలుస్తారని అభిమానులు భావించారు. తాజా విచారణతో ఈ జంట విడిపోవడానికే నిర్ణయించుకుందని స్పష్టమైంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa