హిందీ చిత్ర పరిశ్రమలో సత్తా చాటిన దక్షిణాది నాయికల్లో ఒకరు తమన్నా. ఈ నాయిక తాజాగా మరో కొత్త చిత్రాన్ని బాలీవుడ్లో దక్కించుకుంది. నవాజుద్దీన్ సిద్ధికీ హీరోగా నటిస్తున్న బోలే చూడియా చిత్రంలో తమన్నా నాయికగా ఎంపికైంది. వాస్తవానికి ఈ చిత్రంలో మౌని రాయ్ను నాయికగా అనుకున్నారు. చివరలో హీరోయిన్ మార్పు జరిగింది. మౌని రాయ్ స్థానంలో తమన్నాను తీసుకున్నారు. తమన్నా రాకను బోలే చూడియా చిత్ర బృందం స్వాగతించింది. ప్రతిభావంతమైన నటి తమన్నా చిత్రంలో చేరడంపై నవాజుద్దీన్ సంతోషాన్ని వ్యక్తం చేయగా…తమన్నా స్పందిస్తూ….బోలే చూడియా కథ నాకు బాగా నచ్చింది. నాకు మంచి క్యారెక్టర్ ఇచ్చారు. అనేక ఛాయలున్న పాత్ర పోషిస్తున్నాను. బాలీవుడ్లో ఇంత విభిన్నమైన పాత్రలో నేనెప్పుడూ కనిపించలేదు. అన్నారు.
ఈ చిత్రానికి షమాస్ నవాబ్ సిద్ధికీ దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలోనే చిత్రీకరణ ప్రారంభం కానుంది. చాంద్ స రోషన్ చెహరా చిత్రంతో నటిగా తెరంగేట్రం చేసిన తమన్నా…ఆ తర్వాత పూర్తిగా దక్షిణాది చిత్రాలకే పరిమితమైంది. తెలుగు, తమిళ చిత్రాల్లో అగ్ర తారగా ఎదిగిన తర్వాత హిమ్మత్ వాలా, హమ్షకల్స్, ఎంటర్టైన్మెంట్ ఇలా తాజా ఖామోషీ చిత్రం వరకు హిందీ చిత్రాల్లో నటించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa