గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ప్రముఖ దర్శకుడు శంకర్ తెరకెక్కించిన తాజా చిత్రం 'గేమ్ ఛేంజర్'. ఈ సినిమా మరో 25 రోజుల్లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో శనివారం నాడు అమెరికాలో టికెట్ బుకింగ్స్ మొదలయ్యాయి. ఈ క్రమంలో ఓ అభిమాని చరణ్పై ఉన్న అభిమానాన్ని తెలిపేందుకు స్కై డైవ్ చేశారు. నేటి నుంచే అమెరికాలో టికెట్ బుకింగ్స్ మొదలవుతున్నాయి' అని రాసున్న పోస్టర్ను ఎయిర్క్రాఫ్ట్ నుంచి జంప్ చేసి ప్రదర్శించారు. ఈ వీడియోను 'గేమ్ ఛేంజర్' టీమ్ షేర్ చేయడంతో నెట్టింట వైరల్ అవుతోంది. ఇక ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ను మేకర్స్ అమెరికాలో నిర్వహిస్తున్నట్లు ఇటీవలే ప్రకటించారు. ఈ నెల 21న డల్లాస్లోని కర్టిస్ కల్వెల్ సెంటర్, 4999 నామన్ ఫారెస్ట్, గార్లాండ్ టీఎక్స్ 75040 వేదికగా ఈ మెగా ఈవెంట్ జరగనుంది. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్కు ముఖ్య అతిథిగా డైరెక్టర్ సుకుమార్ వెళ్లనున్నారు. కాగా, ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 10న థియేటర్లలో సందడి చేయనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే విడుదలైన సినిమా టీజర్, పాటలు 'గేమ్ ఛేంజర్'పై బాగా హైప్ క్రియేట్ చేశాయి. ఇక 'గేమ్ ఛేంజర్'లో రామ్ చరణ్ రెండు పవర్ఫుల్ పాత్రల్లో మెప్పించనున్నారు. చెర్రీ సరసన బాలీవుడ్ ముద్దుగుమ్మ కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తోంది. ఎస్ఎస్ తమన్ బాణీలు అందిస్తున్న ఈ మూవీని.. శ్రీవెంకటేశ్వర సినీ క్రియేషన్స్ బ్యానర్పై దిల్ రాజు నిర్మిస్తున్నారు. తమిళ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ ఈ మూవీకి కథను అందించారు. ఎస్. జె సూర్య, శ్రీకాంత్, సునీల్, నవీన్ చంద్ర, అంజలి తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa