టాలీవుడ్ నటుడు అల్లరి నరేష్ డిసెంబర్ 20, 2024న విడుదల కానున్న 'బచ్చల మల్లి' సినిమాతో ప్రేక్షకులను అలరించబోతున్నారు. సుబ్బు మంగదేవి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో అమృత అయ్యర్ కథానాయికగా నటించారు. ఇటీవలే మేకర్స్ విడుదల చేసిన సాంగ్స్, ట్రైలర్ కి భారీ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా మూవీ మేకర్స్ బచ్చల మల్లి తిరునాళ్లు ఈవెంట్ ని డిసెంబర్ 17న అంటే ఈరోజు సాయంత్రం 6:30 గంటలకి హైటెక్ సిటీ లోని వెస్టిన్ హోటల్ లో నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. ఈ ఈవెంట్ కి టాలీవుడ్ లోని ప్రముఖ దర్శకులు మారుతీ, వేణు, కార్తీక్, బుచ్చి బాబు, త్రినాద్ రావు, వసిష్ఠ చీఫ్ గెస్ట్స్ గా హాజరుకానున్నట్లు వెల్లడించారు. ఈ విషయాన్ని తెలియాజేసేందుకు మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసారు. రావు రమేష్, హరితేజ, ప్రవీణ్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. హాస్య మూవీస్ బ్యానర్పై రాజేష్ దండా, బాలాజీ గుత్తా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విశాల్ చంద్ర శేఖర్ ఈ సినిమాకి సంగీత స్వరకర్త.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa