చిత్ర పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే సినీ రంగం హేమాహేమీలు కోల్పోగా తాజాగా ప్రముఖ రచయిత, నిర్మాత ప్రితీశ్ నంది కన్నుమూశారు.ప్రస్తుతం ఆయన వయసు 73 ఏళ్లు. ముంబైలోని తన నివాసంలో బుధవారం (జనవరి 8) గుండెపోటుతో ఆయన తుది శ్వాస విడిచారు. ప్రితీశ్ మృతి చెందిన విషయాన్ని ప్రముఖ నటుడు అనుపమ్ ఖేర్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఆయన అంత్యక్రియలు నిన్న సాయంత్రం జరిగినట్లు తెలిపారు. ప్రముఖ నటుడు, ప్రితీష్ నంది స్నేహితుడు అనుపమ్ ఖేర్ సోషల్ మీడియా పోస్ట్లో ఆయనకు నివాళులర్పిస్తూ..'నాకు అత్యంత ప్రియమైన, సన్నిహిత మిత్రుల్లో ఒకరైన ప్రితీశ్ నంది మరణించారు. ఈ విషయం తెలిసి నేను తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాను. ఆయన ఓ అద్భుతమైన కవి, రచయిత, చిత్ర నిర్మాత, ధైర్యవంతుడు, విశిష్ట జర్నలిస్ట్. ముంబైలో నా కెరీర్ ప్రారంభ రోజుల్లో ప్రతీశ్ ఎంతో సపోర్ట్ చేశారు. నేను చూసిన అత్యంత ధైర్యవంతుల్లో ఆయన కూడా ఒకరు. తన జీవితం కంటే ఎన్నో రెట్లు పెద్దవాడు. ప్రతీష్ నుంచి నేను చాలా నేర్చుకున్నాను. ఆయన్ని చాలా కాలంగా కలవలేదు. కానీ అతను నా ఫొటో ఫిల్మ్ఫేర్ కవర్పై ముద్రించడం నేను ఎప్పటికీ మరచిపోలేనని అనుపమ్ ఖేర్ తన ఎక్స్ ఖాతాలో షేర్ చేసిన పోస్ట్లో పేర్కొన్నారు. ఇర ప్రితీశ్ నంది మరణ వార్త తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు ఆయనకు నివాళులు అర్పిస్తూ సోషల్ మీడియా ద్వారా సంతాపం తెలుపుతున్నారు. ఇక జర్నలిస్టు షీలా భట్కూడా ఎక్స్లో పోస్టు పెట్టారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa