విక్టరీ వెంకటేష్ మరోసారి విజయవంతమైన దర్శకుడు అనిల్ రావిపూడితో కలిసి 'సంక్రాంతికి వస్తున్నాం' అనే సినిమాని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రం జనవరి 14, 2025న గ్రాండ్ రిలీజ్కి సిద్ధమయ్యారు. ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి మరియు ఐశ్వర్య రాజేష్ కథానాయికలుగా నటించారు. ఈ సినిమాలోని గోదారి గట్టు, మీను సాంగ్స్ చార్ట్బస్టర్గా నిలిచాయి, సినిమాపై అంచనాలను మరింత పెంచింది. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా ప్రొడ్యూసర్ శిరీష్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ స్పెషల్ పోస్టర్ ని విడుదల చేసారు. ఈ చిత్రంలో ఉపేంద్ర లిమాయే, రాజేంద్ర ప్రసాద్, సాయి కుమార్, నరేష్, VT గణేష్, మరియు మురళీధర్ గౌడ్ కీలక పాత్రల్లో ప్రతిభావంతులైన సమిష్టి తారాగణం కూడా ఉన్నారు. ఈ చిత్రానికి సంగీతం భీమ్స్ సిసిరోలియో స్వరాలు సమకుర్చారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై దిల్ రాజు ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa