ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తెలుగురాష్ట్రాలలో 'సంక్రాంతికి వస్తున్నాం' కి స్క్రీన్ లు జోడింపు

cinema |  Suryaa Desk  | Published : Fri, Jan 17, 2025, 05:21 PM

అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన విక్టరీ వెంకటేష్ తాజా చిత్రం 'సంక్రాంతికి వస్తున్నాం' దేశీయ మరియు అంతర్జాతీయ మార్కెట్లలో అద్భుతమైన ప్రదర్శనతో బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ సృష్టిస్తుంది. దిల్ రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై శిరీష్ నిర్మించిన ఈ చిత్రం వరల్డ్ వైడ్ బాక్స్ఆఫీస్ వద్ద సెన్సేషన్ ని సృష్టిస్తుంది. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమాకి తెలుగురాష్ట్రాలలో 220+ స్క్రీన్స్ ని ఆడ్ చేసినట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు చిత్ర బృందం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్  ని విడుదల చేసింది. విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వచ్చిన విజయమే ఈ సినిమా విజయానికి నిదర్శనం. ఈ చిత్రం యొక్క ఆకట్టుకునే బాక్సాఫీస్ ప్రదర్శన రాబోయే రోజుల్లో కొనసాగుతుందని అంచనా వేయబడింది. ఐశ్వర్య రాజేష్ మరియు మీనాక్షి చౌదరి ప్రధాన పాత్రలలో నటిస్తున్న ఈ చిత్రంలో అవసరాల శ్రీనివాస్, మురళీధర్, VTV గణేష్, ఉపేంద్ర మరియు శ్రీనివాస రెడ్డి కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa