ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దయచేసి ఫొటోలు తీయొద్దు : కరీనా

cinema |  Suryaa Desk  | Published : Wed, Jan 29, 2025, 10:58 AM

తమ పిల్లల ఫొటోలు తీయొద్దని బాలీవుడ్‌ నటి కరీనా కపూర్‌ విజ్ఞప్తి చేశారు. ఇటీవల సైఫ్‌పై దాడి జరిగిన తర్వాత కరీనా ఈ ప్రకటన చేయడం చర్చనీయాంశంగా మారింది. తైమూర్‌, జేహ్‌ల గార్డెన్‌ పుట్టినరోజు వేడుకల్లో, క్రీడా కేంద్రాల్లో ఎక్కడ కనిపించినా వారి ఫొటోలు తీయొద్దని కరీనా ఫొటోగ్రాఫర్లను కోరారు. కరీనా, సైఫ్‌ల ఫొటోల కోసం కూడా వారి నివాసం వద్ద ఉండొద్దని పీఆర్‌ టీమ్‌ తెలిపింది. ఏదైనా ఈవెంట్లలో కనిపిస్తే వారి చిత్రాలు తీసుకోమని టీమ్‌ చెప్పింది. ఇటీవల సైఫ్‌ అలీఖాన్‌పై దాడి జరిగిన విషయం తెలిసిందే. చోరీ కోసం వారి ఇంట్లోకి ప్రవేశించిన దుండగుడు అతడిపై ఆరుసార్లు కత్తితో దాడి చేశాడు.  సైఫ్, అతడి కుటుంబసభ్యులు నిద్రలో ఉండగా.. దుండగుడు సైఫ్‌ చిన్న కుమారుడు జేహ్‌ గదిలోకి వెళ్లాడు. దుండగుడిని చూసిన జేహ్‌ కేర్‌టేకర్‌ కేకలు వేయగా సైఫ్‌ అక్కడికి చేరుకొన్న సమయంలో పెనుగులాట జరిగింది. ఈ క్రమంలో సైఫ్‌ గాయపడ్డారు. ఆరుచోట్ల కత్తి గాయాలయ్యాయి. శస్త్ర చికిత్స అనంతరం ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారు.మరోవైపు సైఫ్‌ తర్వగా కోలుకోవడం ఆనందంగా ఉందని కరీనా కపూర్‌ సోదరుడు జహాన్‌ కపూర్‌ ఓ ఇంటర్వ్యూలో అన్నారు. ఈ దాడి కారణంగా వారి కుటుంబం ఎంతో బాధ పడిందన్నారు. ‘‘ఈ ఘటన కారణంగా మా కుటుంబమంతా ఆందోళన చెందింది. ఇలాంటి వాటిని ఎదుర్కోవడం ఎంతో కష్టం. దాడి గురించి తెలియగానే గందరగోళానికి గురయ్యాం. అతడు సురక్షితంగా బయటపడినందుకు మేమంతా ఊపిరి పీల్చుకున్నాం’’ అని తెలిపారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa