ఈ సంక్రాంతికి ‘డాకు మహారాజ్’ అంటూ ప్రేక్షకులను పలకరించి హిట్ను సొంతం చేసుకున్నారు అగ్ర కథానాయకుడు బాలకృష్ణ. ఈ చిత్రంలో కావేరిగా తన పాత్రతో అందరినీ ఆకట్టుకున్నారు నటి ప్రజ్ఞా జైస్వాల్ . గతంలో బాలకృష్ణతో కలిసి ఆమె నటించిన ‘అఖండ’ కూడా సూపర్హిట్గా నిలిచిన విషయం తెలిసిందే. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ప్రగ్యా మాట్లాడుతూ.. ఈ అగ్ర హీరోతో వరుస సినిమాల గురించి ఆమె స్పందించారు. నటీనటుల మధ్య వయసు వ్యత్యాసం గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. ‘‘నా పుట్టినరోజు నాడే ‘డాకు మహారాజ్’ విడుదలై విజయాన్ని అందుకుంది. ఈ ఏడాది నాకు అద్భుతంగా ప్రారంభమైందని భావించా. ఈ సినిమాలో కావేరి పాత్రకు వస్తోన్న స్పందన చూస్తుంటే ఆనందంగా ఉంది. ‘డాకు మహారాజ్’ విడుదలైన దగ్గర నుంచి నన్ను అందరూ ‘డాకు మహారాణి’ అని పిలుస్తున్నారు. కావేరి పాత్ర అంత ప్రభావితం చూపింది. ఒక నటిగా నాకు ఇది ఎంతో సంతృప్తినిచ్చిన చిత్రం. గర్భిణి పాత్రలో నటించడం కొత్త అనుభూతినిచ్చింది. తనకు పుట్టబోయే బిడ్డ కోసం కావేరి చేసిన పోరాటం ప్రేక్షకుల మనసులను కదిలించింది. మహిళలు ఎంత బలమైనవారో ఈ పాత్ర చూస్తే అర్థమవుతుంది’’ అన్నారు.
ఇక బాలకృష్ణతో రెండు సినిమాలకు వర్క్ చేయడం గురించి మాట్లాడుతూ.. ‘ఆయన ఒక లెజెండ్. బాలకృష్ణ పేరు చెప్పగానే ‘పాజిటివిటి’ పదం గుర్తొస్తుంది. ఆయన నుంచి నేర్చుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి. మనసులో మాటను నిర్మొహమాటంగా చెప్పగల వ్యక్తి. అందరినీ ఒకేలా గౌరవిస్తారు. మంచి మనిషి. పాత్ర ఆధారంగా నటీనటులను ఎంపిక చేస్తారు. అంతేగానీ వారి వయసు ఆధారంగా సినిమా అవకాశాలు ఇవ్వరు. నాకు ఇచ్చిన పాత్రకు వందశాతం న్యాయం చేశానా, లేదా.. అనేదే ఆలోచిస్తాను. నా దృష్టిలో ఏజ్ అనేది ఒక సమస్య కాదు. ‘అఖండ’ విడుదలైన తర్వాత మా ఇద్దరినీ స్క్రీన్పై చూసి ఆశ్చర్యపోయాను’’ అని చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa