ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మహా కుంభమేళాలో బింధు మాధవి

cinema |  Suryaa Desk  | Published : Thu, Feb 06, 2025, 10:43 AM

ప్రపంచంలో అతి పెద్ద ఆధ్యాత్మిక వేడుకగా గుర్తింపు పొందిన ప్రయాగ్ రాజ్ మహా కుంభమేళా అప్రతిహతంగా కొనసాగుతోంది. జనవరి 13న అట్టహాసంగా ప్రారంభమైన ఈ వేడుక ఫిబ్రవరి 26 వరకు జరగనుంది.ఇప్పటికే దేశ విదేశాల నుంచి కోట్లాది మంది భక్తులు మహా కుంభమేళాలో పవిత్ర స్నానాలు ఆచరించారు. సామాన్యులతో పాటు వివిధ రంగాలకు చెందిన సెలబ్రిటీలు కూడా ఈ ఆధ్యాత్మిక వేడుకలో భాగమవుతున్నారు. ముఖ్యంగా సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు మహా కుంభమేళాలో పాల్గొంటున్నారు. పవిత్ర త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. అనంతరం తమ ఆధ్యాత్మిక యాత్ర కు సంబంధించిన ఫొటోలు, విశేషాలను అందరితో షేర్ చేసుకుంటున్నారు. పూనమ్ పాండే, యాంకర్ లాస్య, హేమమాలిని, సంయుక్త మేనన్, శ్రీనిధి శెట్టి, పవిత్ర గౌడ.. ఇలా ఎందరో సినీ తారలు ఇప్పటికే కుంభమేళాను దర్శించుకున్నారు. తాజాగా మరో టాలీవుడ్ హీరోయిన్ బింధు మాధవి మహా కుంభమేళాలో తళుక్కుమంది. తన కుటుంబ సభ్యులతో కలిసి పవిత్ర త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించింది. అనంతరం తన మహా కుంభమేళ యాత్ర ఫొటోలను, వీడియోలను ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేసింది. ప్రస్తుతం ఇవి నెట్టింట తెగ వైరలవుతున్నాయి.మదన పల్లెకు చెందిన బిందు మాధవి ఆవకాయ్ బిర్యానీ తో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది. ఆతర్వాత బంపరాఫర్, ఇంకోసారి, రామ రామ కృష్ణ కృష్ణ, పిల్ల జమీందార్ తదితర తెలుగు హిట్ ల్లో నటించింది. ఇక తమిళంలోనూ పలు ల్లో కథానాయికగా నటించి మెప్పించిందీ అందాల తార. యాంగర్ టేల్స్, న్యూసెన్స్, మ్యాన్షన్ 24, పరువు వెబ్ సిరీస్ లతో ఓటీటీ ఆడియెన్స్ నూ మెప్పించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa