రజనీకాంత్ కథానాయకుడిగా లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ ‘కూలీ’. నాగార్జున, శ్రుతిహాసన్, సత్యరాజ్, ఉపేంద్ర తదితరులు కీలక పాత్రధారులు. ఆ సినిమాలో పూజా హెగ్డే నటించనున్నట్లు కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే! అయితే ఇప్పుడు ఈ చిత్రంలో పూజా ఫిక్స్ అయ్యారు. ఈ విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా తెలిపింది.దీనికి సంబంధించి ఓ ప్రీ లుక్ పోస్టర్ విడుదల చేసి ఈ స్టార్ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టాలంటూ పోస్ట్ పెట్టింది. తాజాగా ఆ ప్రీ లునిక్ పోస్టర్ పూజా హెగ్డేదేనంటూ ఖరారు చేశారు. ఇందులో పూజా ఇందులో కీలక పాత్రలో నటించనున్నారా, ప్రత్యేక గీతంలో కనిపించనున్నారా అనేది తెలియాల్సి ఉంది. అనిరుధ్ ఈ సినిమాకు ‘జైలర్’లోని ‘కావాలయ్యా’ పాట తరహాలో ఓ ప్రత్యేక గీతాన్ని ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది. బంగారం స్మగ్లింగ్ అంశంతో ముడిపడి ఉన్న ఈ యాక్షన్ థ్రిల్లర్లో.. రజనీ పవర్ఫుల్ రోల్లో కనిపిస్తారు. ఆమిర్ఖాన్, నాగార్జున, ఉపేంద్ర, శ్రుతిహాసన్ తదితరులు కీలక పాత్రలు ఆగస్టులో రిలీజ్ చేసే అవకాశం ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa