ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మహేష్ నవ్వుల ట్రైన్ సంక్రాంతికి వస్తుంది...

cinema |  Suryaa Desk  | Published : Sat, Aug 03, 2019, 01:52 PM

సంక్రాంతి కానుకగా ప్రేక్షకులను నవ్వించేందుకు "సరిలేరు నీకెవ్వరూ" అనే నవ్వుల ట్రైన్లో మహేష్ బాబు వస్తున్నారంటూ దర్శకుడు అనీల్ రావిపూడి.`హిలేరియస్ ట్రైన్ కామెడీని థియేటర్స్‌లో ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా? మా ట్రైన్ సంక్రాంతికి సిద్ధం అవుతోంది. మా సినిమా కోసం సిద్ధంగా ఉండండి.. సూపర్‌స్టార్ మిమ్మల్ని ఎంటర్‌టైన్ చేస్తారు` అని అంటూ అనీల్ ట్విట్టర్లో పోస్టు చేశారు.  ఈయన దర్శకత్వంలో మహేశ్ హీరోగా రూపొందుతోన్న చిత్రం `సరిలేరు నీకెవ్వరు`. ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ ప్రస్తుతం హైదరాబాద్‌లో శరవేగంగా జరుగుతుంది. ట్రైన్ ఎపిసోడ్ చిత్రీకరణ కోసం హైదరాబాద్ అన్నపూర్ణలో ఓ భారీ ట్రైన్ సెట్‌ను ఏర్పాటు చేశారు. అందులోనే చిత్రీకరణ జరుగుతోంది. దిల్‌రాజు, అనీల్ రావిపూడి, మహేశ్ ఈ సినిమా నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాను సంక్రాంతికి విడుదల చేయడానికి దర్శక నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa