ట్రెండింగ్
Epaper    English    தமிழ்

4M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'భైరవం' ట్రైలర్

cinema |  Suryaa Desk  | Published : Mon, May 19, 2025, 02:59 PM

విజయ్ కనకమేడల దర్శకత్వంలో టాలీవుడ్ నటుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ 'భైరవం' సినిమా చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాలో అతిధి శంకర్ మహిళా ప్రధాన పాత్రలో నటిస్తుంది. ఈ సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస్‌తో పాటు మంచు మనోజ్ మరియు నారా రోహిత్ కూడా ముఖ్యమైన పాత్రల్లో నటించారు. ఈ ముగ్గురు నటీనటులు స్క్రీన్‌ను పంచుకునే అవకాశం అభిమానులలో మరియు సినీ ఔత్సాహికులలో విపరీతమైన ఉత్సాహాన్ని సృష్టించింది. ఈ చిత్రం నుండి ఇప్పటివరకు విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ మూవీ పై భారీ బజ్ ని క్రియేట్ చేసింది. ఇటీవలే మూవీ మేకర్స్ ఈ సినిమా యొక్క ట్రైలర్ ని గ్రాండ్ ఈవెంట్ లో విడుదల చేసారు. తాజగా ఇప్పుడు ఈ సినిమా ట్రైలర్ యూట్యూబ్ లో 4 మిలియన్ వ్యూస్ ని సొంతం చేసుకున్నట్లు మూవీ మేకర్స్ ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు చిత్ర బృందం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. ఈ సినిమాలో దివ్య పిళై, ఆనంది, ప్రముఖ దర్శకుడు సందీప్ రాజ్, అజయ్, శరత్, జయసుధ, సంపత్ రాజ్, గోపరాజు రమణ ముఖ్య పాత్రలలో కనిపించనున్నారు. ఈ చిత్రానికి సంభాషణలు సత్యర్షి మరియు తూమ్ వెంకట్ అందించగా, భాస్కర భట్ల, కాసర్ల శ్యామ్, చైతన్య ప్రసాద్, బాలాజీ మరియు తిరుపతి సాహిత్యం అందించారు. ఈ చిత్రం తమిళ బ్లాక్‌బస్టర్ గరుడన్ యొక్క అధికారిక తెలుగు రీమేక్‌. పెన్ స్టూడియోస్‌కు చెందిన డాక్టర్ జయంతిలాల్ గదా ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌ బ్యానర్ పై ఈ సినిమాని నిర్మిస్తున్నారు. సాంకేతిక బృందంలో సినిమాటోగ్రాఫర్ హరి కె వేదాంతం, మ్యూజిక్ కంపోజర్ శ్రీ చరణ్ పాకాల, ఎడిటర్ ఛోటా కె ప్రసాద్, ప్రొడక్షన్ డిజైనర్ బ్రహ్మ కడలి ఉన్నారు. ఈ సినిమా మే 30న విడుదల కానుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa