నటి, దర్శకురాలు రేణు దేశాయ్ సోషల్ మీడియాలో తరచూ తన అభిప్రాయాలను, వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ అభిమానులకు దగ్గరగా ఉంటారు. తాజాగా ఆమె తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో చేసిన ఒక పోస్ట్ నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది. "క్రీడల ముసుగులో ఇతరుల్ని బాధపెట్టడం అవసరమని మానవులు ఎందుకు భావిస్తారు?" అనే తాత్వికమైన ప్రశ్నను ఆమె లేవనెత్తారు.జంతు ప్రేమికురాలిగా పేరుపొందిన రేణు దేశాయ్, తరచూ మూగజీవాలకు సంబంధించిన విషయాలపై స్పందిస్తుంటారు. వాటి సంరక్షణ, హక్కుల గురించి ఆమె చేసే పోస్టులు వైరల్ అవుతుంటాయి. ప్రస్తుత పోస్ట్ కూడా ఆ కోవకు చెందిందేనని పలువురు భావిస్తున్నారు. క్రీడలు లేదా వినోదం పేరుతో జంతువులను హింసించడం లేదా మరే ఇతర రూపంలోనైనా ఇతరులను ఇబ్బంది పెట్టడాన్ని ఉద్దేశించి ఆమె ఈ వ్యాఖ్యలు చేసి ఉండవచ్చని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.పలు సినిమాల్లో నటించిన రేణు దేశాయ్, నటుడు పవన్ కల్యాణ్ను వివాహం చేసుకున్న తర్వాత నటనకు దూరంగా ఉన్నారు. వీరికి అకీరా నందన్, ఆద్య అనే ఇద్దరు పిల్లలున్నారు. పవన్ కల్యాణ్తో విడిపోయిన అనంతరం పిల్లల బాధ్యతలను చూసుకుంటూ వస్తున్నారు. చాలా కాలం తర్వాత, రవితేజ నటించిన "టైగర్ నాగేశ్వరరావు" చిత్రంలో హేమలత లవణం అనే కీలక పాత్రలో నటించి ఆమె నటనకు మంచి ప్రశంసలు అందుకున్నారు. సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉండే రేణు దేశాయ్, తన తాజా పోస్ట్ ద్వారా మరోసారి ఆలోచనలు రేకెత్తించే ప్రయత్నం చేశారు. ఈ వ్యాఖ్యలపై నెటిజన్ల నుంచి భిన్నమైన స్పందనలు వస్తున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa