ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సురేశ్‌ గోపి చిత్రానికి దొరకని సెన్సార్‌ బోర్డు అనుమతి

cinema |  Suryaa Desk  | Published : Tue, Jun 24, 2025, 03:47 PM

కేంద్రమంత్రి, నటుడు సురేశ్‌ గోపి, నటి అనుపమ పరమేశ్వరన్‌ కీలక  పాత్రధారులుగా తెరకెక్కిన చిత్రం ‘జానకి వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ కేరళ. జానకి అనే మహిళ చేేస న్యాయపోరాటం చుట్టూ తిరిగే థ్రిల్లర్‌ కథాంశంతో ప్రవీణ్‌ నారాయణ్‌ తెరకెక్కించారు. సత్యం ఎప్పటికైనా విజయం సాధిస్తుందనేది ఉప శీర్షిక. ఇందులో జానకిగా అనుపమ కనిపించనున్నారు. లాయర్‌గా సురేశ్‌ గోపి నటించారు. జూన్‌ 27న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది. అయితే ఇప్పుడు ఈ సినిమాకు సెన్సార్‌ బోర్డు సర్టిఫికెట్‌ నిరాకరించడం ఇండస్ట్రీలో  చర్చనీయాంశంగా మారింది.సీతాదేవి మరో పేరైన జానకిని అలాంటి పాత్రకు పెట్టకోలేమని పేర్కొంటూ ఈ చిత్రం స్క్రీనింగ్ కు అనుమతి నిరాకరించినట్లు సినీ వర్గాలు ఓ సమావేశంలో తెలిపాయి.  అలాగే ఈ సినిమా ప్రదర్శనకు సెన్సార్‌ బోర్డు అనుమతి నిరాకరించిందని దర్శకుడు చెప్పారు. ఇక ఫిల్మ్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ కేరళ ప్రధాన కార్యదర్శి, ప్రముఖ దర్శకుడు ఉన్ని కృష్ణన్‌ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. సినిమాలో జానకి అనే పేరును ఉపయోగించరాదు. సెన్సార్‌ బోర్డు ఈ చిత్ర నిర్మాతలకు స్పష్టంగా తెలియజేసింది. టైటిల్‌, పాత్ర పేరును మార్చాలని బోర్డు చిత్రబృందానికి సూచించింది. దాడికి గురైన మహిళ పాత్రకు సీతాదేవి పేరును పెట్టలేమని బోర్డు చెప్పింది’’ అని అన్నారు. ఈ మధ్యనే మరో మలయాళ చిత్రానికి ఇలాంటి సమస్యే ఎదురు కాగా సెన్సార్‌ సర్టిఫికెట్‌ పొందడానికి ఆ పేరును ‘జయంతి’గా మార్చారని తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa