ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అల్లు అరవింద్‌కు జీహెచ్‌ఎంసీ నోటీసులు

cinema |  Suryaa Desk  | Published : Tue, Sep 09, 2025, 11:29 AM

ప్రముఖ సినీ నిర్మాత అల్లు అరవింద్‌కు GHMC అధికారులు నోటీసులు జారీ చేశారు. జూబ్లీహిల్స్‌ రోడ్డు నంబరు 45లో ఆయన అల్లు బిజినెస్‌ పార్క్‌ పేరిట ఓ భవనం నిర్మించారు. అయితే, ఇటీవల ఆ భవనంపై అదనంగా పెంట్‌హౌస్‌ నిర్మించారు. దీంతో అక్రమంగా నిర్మించిన పెంట్‌హౌస్ ను ఎందుకు కూల్చకూడదో వివరణ ఇవ్వాలని GHMC అధికారులు నోటీసుల్లో పేర్కొన్నారు. వివరణ ఇవ్వకుంటే కూల్చివేత చర్యలు చేపట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa