by Suryaa Desk | Fri, Jun 28, 2024, 07:27 PM
తెలంగాణ గవర్నర్ సీ.పీ. రాధాకృష్ణన్ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో సమావేశం అయ్యారు. విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గాన సీఎం చంద్రబాబు ఉండవల్లి నివాసానికి చేరుకున్నారు. రెండు గంటలపాటు సమావేశం కొనసాగింది. మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారని టిడిపి వర్గాలు చెబుతున్నారు. ఎలాంటి రాజకీయ అంశాలు ప్రస్తావించలేదని పేర్కొంది. గత కొన్నేళ్లుగా రెండు రాష్ట్రాల మధ్య ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014 కి సంబంధించిన అనేక సమస్యలు పెండింగ్లో ఉన్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన పూర్తైన 10 ఏళ్ల తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 ప్రకారం రెండు రాష్ట్రాల మధ్య ఆస్తులు, అప్పుల విభజన అస్పష్టంగానే ఉన్నట్లు తెలుస్తోంది.
Latest News