by Suryaa Desk | Mon, Jul 01, 2024, 05:44 PM
ఒడిసా రాష్ట్రం సున్నాపురం బీచ్ సమీపంలో ఇచ్ఛాపురం మండలం కేదారిపురం గ్రామానికి చెందిన యువకుడు ఆశి బాలు(27) దారుణహత్యకు గురయ్యాడు. ఒడిసా పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఆదివారం తన స్నేహి తులతో కలిసి సున్నాపురం బీచ్కు వెళ్లాడు. అంతా సాయంత్రం వరకు సరదాగా గడిపారు. సాయం త్రం సమయంలో ఇచ్ఛాపురం పట్టణానికి చెందిన కొంతమంది యువకులతో ఘర్షణ పడ్డారు. తర్వా త ఏమి జరిగిందో తెలియదు గాని ఆరు గంటల సమయంలో బీచ్ నుంచి వస్తుండగా దారి కాసి ఇచ్ఛాపురం పట్టణానికి చెందిన కొందరు వ్యక్తులు కత్తులతో దాడి చేసి హత్య చేశారు. విషయం తెలుసుకున్న ఒడిశా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం బరంపురం ఆసుపత్రికి తరలించారు. బాలుకి సావిత్రి ఉంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఒడిసా పోలీసులు తెలిపారు.
Latest News