by Suryaa Desk | Mon, Jul 01, 2024, 05:44 PM
చట్టసభల్లో హుందాగా మాట్లాడాలని, రాజకీయాలు రోజు రోజుకూ దారుణంగా మారుతున్నాయని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు వ్యాఖ్యానించారు. ఏ రాజకీయ నాయకుడు ఎప్పుడు ఏ పార్టీలో ఉంటాడో తెలియడం లేదని చమత్కరించారు. మంత్రి సత్యకుమార్ తనతో దాదాపు 27 ఏళ్లు ఉన్నారని చెప్పారు. మంత్రి సత్య కుమార్కు శుభాకాంక్షలు తెలిపారు. ఎవరైనా తమ తమ వంశాల నుంచి ఎవరో ఒకరిని రాజకీయల్లో ఉండాలని కోరుకుంటారని అన్నారు. ఈరోజు(ఆదివారం) నెల్లూరు జిల్లాలో వెంకయ్య నాయుడు పర్యటించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. తన కొడుకు, కూతురును రాజకీయాల్లోకి తీసుకు రావాలని చాలామంది తనపై ఒత్తిడి తెచ్చారని గుర్తుచేశారు. వారు వారి వారి పనుల్లో బిజీగా ఉన్నారని వెంకయ్య నాయుడు తెలిపారు.
Latest News