ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలి
 

by Suryaa Desk | Tue, Jul 02, 2024, 02:15 PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలి. ఇది డిమాండ్ కాదు.. ఏపీ ప్రజల హక్కు అని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్ల‌మెంట‌రీ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. ఏపీలో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కేంద్ర ప్రభుత్వంలో  కూడా భాగస్వామిగా ఉందని, రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెచ్చే అవకాశం ఇప్పుడు ఆ పార్టీకి దక్కిందని వైయ‌స్ఆర్‌సీపీ పార్లమెంటరీ నేత వైవీ సుబ్బారెడ్డి అన్నారు. మంగళవారం ఉదయం రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా.. ఏపీకి సంబంధించిన పలు కీలకాంశాల్ని ప్రస్తావించారాయన. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలి. ఇది డిమాండ్ కాదు.. ఏపీ ప్రజల హక్కు. ఏపీకి ప్రత్యేక హోదా తీసుకొచ్చే అవకాశం ఇప్పుడు టీడీపీకి ఉంది. రాష్ట్రంలో అధికారంలో ఉండడంతో పాటు కేంద్ర ప్రభుత్వంలో  కూడా భాగస్వామ్య పార్టీగా ఉంది. కాబట్టి, ప్రత్యేక హోదా కోసం కేంద్ర ప్రభుత్వాన్ని టీడీపీ అడగాలి. అన్యాయంగా విభజించడం వల్ల ఆంధ్రప్రదేశ్‌ నష్టపోయింది. ప్రత్యేక హోదా వల్ల నష్టాన్ని నివారించే అవకాశం ఉంది. విభజన చట్టంలోని పెండింగ్ అంశాలను పూర్తి చేయాలి అని ఆయన కోరారు. 

Latest News
Body of MBBS student who died in Russia flown to Delhi: MP CM Sat, Oct 19, 2024, 12:09 PM
India’s primary market on remarkable growth trajectory fuelled by IPO surge Sat, Oct 19, 2024, 12:06 PM
South Korea to expand private-led cloud industry in AI era Sat, Oct 19, 2024, 12:03 PM
Tech Mahindra reports 153 pc PAT growth at Rs 1,250 crore in Q2 Sat, Oct 19, 2024, 11:59 AM
1st Test: Rain stops play after Sarfaraz's maiden hundred, Pant's fifty take India to 344/3 Sat, Oct 19, 2024, 11:53 AM