![]() |
![]() |
by Suryaa Desk | Wed, Mar 26, 2025, 03:50 PM
పరిగి పంచాయతీ కార్మికులు పెండింగ్ లో ఉన్న 5 నెలల జీతాలు వెంటనే ఇవ్వాలని ఏఐటీయూసీ ఆధ్వర్యంలో బుధవారం పంచాయతీ కార్యదర్శి నారాయణకి వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ఏఐటీయూసీ నాయకుడు వినోద్ మాట్లాడుతూ కార్మికులకు పెండింగ్ లో ఉన్న 5 నెలల జీతాలు ఉగాది, రంజాన్ పండుగలు దృష్టిలో ఉంచుకొని వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. పండగలోపు జీతాలు చెల్లించకపోతే ఆందోళన కార్యక్రమాలను ఉదృతం చేస్తామని ఏఐటీయూసీ నాయకులు తెలిపారు.