|
|
by Suryaa Desk | Fri, Dec 12, 2025, 01:57 PM
AP: అల్లూరి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదం నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జిల్లాలోని అన్ని ఘాట్ రోడ్లపై రాత్రిపూట భారీ వాహనాల రాకపోకలను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు లారీలు, బస్సులు వంటి హెవీ వాహనాలు ఘాట్ రోడ్లలోకి ప్రవేశించకూడదని ఆదేశించింది. ప్రమాదాలు నివారించేందుకు ఈ నిర్ణయం వెంటనే అమల్లోకి రాగా, నియమాన్ని ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు.
Latest News