లిబియాలో కిడ్నాప్‌కు గురైన భారతీయ కుటుంబం
 

by Suryaa Desk | Sun, Dec 14, 2025, 04:22 PM

అక్రమంగా విదేశాలకు వలస వెళ్లే ప్రయత్నంలో గుజరాత్‌కు చెందిన ఓ కుటుంబం లిబియాలో కిడ్నాప్‌కు గురైంది. దంపతులతో పాటు వారి మూడేళ్ల కుమార్తెను కూడా బంధించిన దుండగులు, వారిని విడిచిపెట్టాలంటే రూ. 2 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ వివరాలను అధికారులు వెల్లడించారు.మెహసానా జిల్లాలోని బాదల్‌పురా గ్రామానికి చెందిన కిస్మత్‌సిన్హ్ చావ్డా, ఆయన భార్య హీనాబెన్, కుమార్తె దేవాన్షీ.. పోర్చుగల్‌లో స్థిరపడాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటికే కిస్మత్‌సిన్హ్ సోదరుడు అక్కడే ఉంటుండటంతో, ఓ పోర్చుగల్ ఏజెంట్ సహాయంతో వారు ప్రయాణం ప్రారంభించారు. ఈ విషయాన్ని మెహసానా ఎస్పీ హిమాన్షు సోలంకి తెలిపారు.పోలీసుల కథనం ప్రకారం ఈ కుటుంబం నవంబర్ 29న అహ్మదాబాద్ నుంచి దుబాయ్ వెళ్లింది. అక్కడి నుంచి వారిని లిబియాలోని బెంఘాజీ నగరానికి తరలించగా, అక్కడే వారు కిడ్నాప్‌కు గురయ్యారు. అనంతరం కిడ్నాపర్లు మెహసానాలోని వారి బంధువులను సంప్రదించి రూ. 2 కోట్లు డిమాండ్ చేశారు. ఈ కేసులో ప్రమేయమున్న ఏజెంట్లు భారతీయులు కాదని పోలీసులు స్పష్టం చేశారు.బాధితుల బంధువులు శుక్రవారం తమను సంప్రదించారని మెహసానా కలెక్టర్ ఎస్.కె. ప్రజాపతి తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే సీజే చావ్డా కూడా ఈ అంశాన్ని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఈ విషయాన్ని కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖకు తెలియజేసి, వారిని సురక్షితంగా విడిపించేందుకు చర్యలు చేపట్టినట్లు కలెక్టర్ వివరించారు.

Latest News
IPL 2026: 'So excited to get down to Eden,' says Cam Green after being roped in by KKR Tue, Dec 16, 2025, 05:04 PM
Over 3000 Afghan refugees forcibly deported from Iran, Pakistan in single day Tue, Dec 16, 2025, 05:01 PM
GST rate revision has resulted in 5 per cent rise in revenue for states: Minister Tue, Dec 16, 2025, 04:59 PM
BJP Working President Nitin Nabin resigns from Bihar cabinet Tue, Dec 16, 2025, 04:59 PM
India's textiles exports see 4.6 pc growth in last 4 fiscals, exports rise in over 100 nations Tue, Dec 16, 2025, 04:35 PM