|
|
by Suryaa Desk | Sat, Dec 20, 2025, 10:13 AM
వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తమిళనాడులో కేంద్ర ఎన్నికల సంఘం ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ చేపట్టింది. శుక్రవారం విడుదల చేసిన ముసాయిదా జాబితాలో గత జాబితాతో పోలిస్తే 97 లక్షల ఓటర్ల పేర్లను తొలగించారు. తొలగించిన వారిలో 27 లక్షల మంది మృతి చెందగా, 66 లక్షల మంది ఇతర రాష్ట్రాల్లో స్థిరపడ్డారు, మరో 3.4 లక్షల మంది డూప్లికేట్ ఓటర్లు ఉన్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది. ఓటు హక్కు కోల్పోయిన వారు జనవరి 18లోగా అభ్యంతరాలు తెలపవచ్చు.
Latest News