|
|
by Suryaa Desk | Sat, Dec 20, 2025, 03:23 PM
ఆంధ్రప్రదేశ్లో ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల షెడ్యూల్లో స్వల్ప మార్పులు జరిగాయి. హోలీ, రంజాన్ పండుగల దృష్ట్యా కొన్ని పరీక్షల తేదీలను సవరిస్తూ ఇంటర్ బోర్డు శుక్రవారం కొత్త టైం టేబుల్ను విడుదల చేసింది. ఈ మార్పుల ప్రకారం మొత్తం నాలుగు పరీక్షల తేదీలు మారాయి.వివరాల్లోకి వెళితే, 2026 విద్యా సంవత్సరానికి సంబంధించి మార్చి 3న (హోలీ) జరగాల్సిన ఇంటర్ ద్వితీయ సంవత్సరం మ్యాథమెటిక్స్ పేపర్-2ఏ, సివిక్స్ పేపర్-2 పరీక్షలను మార్చి 4వ తేదీకి వాయిదా వేశారు. అదేవిధంగా, మార్చి 20న (రంజాన్) నిర్వహించాల్సిన ప్రథమ సంవత్సరం అడ్మినిస్ట్రేషన్ పేపర్-1, లాజిక్ పేపర్-1 పరీక్షలను మార్చి 21కి మార్చారు.మిగిలిన పరీక్షలన్నీ గతంలో ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే యథాతథంగా జరుగుతాయని బోర్డు అధికారులు స్పష్టం చేశారు. ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలు ఫిబ్రవరి 23 నుంచి మార్చి 24 వరకు, ద్వితీయ సంవత్సరం పరీక్షలు ఫిబ్రవరి 24 నుంచి మార్చి 23 వరకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతాయి.ప్రభుత్వం ప్రకటించిన 2026 సెలవుల జాబితాను అనుసరించి ఈ మార్పులు చేసినట్లు బోర్డు తెలిపింది.
Latest News