|
|
by Suryaa Desk | Sat, Dec 20, 2025, 11:07 PM
టీ20 వరల్డ్ కప్ 2026తో పాటు న్యూజిలాండ్తో జరగనున్న టీ20 సిరీస్కు భారత జట్టును బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. ఈ జట్టు ఎంపికలో ప్రధాన చర్చనీయాంశమైన అంశం శుభ్మన్ గిల్ను పూర్తిగా జట్టుకు దూరం పెట్టడమే. ఇప్పటివరకు వైస్ కెప్టెన్గా కొనసాగిన గిల్ను ఆ బాధ్యత నుంచి తప్పించడమే కాకుండా, 15 మంది జట్టులోనూ చోటు ఇవ్వలేదు. గిల్ ఇటీవలి ఫామ్పై సెలెక్టర్లు అసంతృప్తిగా ఉన్నారనే విషయం ఈ నిర్ణయంతో స్పష్టమైంది.
వికెట్ కీపర్-బ్యాటర్ జితేశ్ శర్మను కూడా ఈసారి పక్కన పెట్టారు. అతని స్థానంలో మంచి ఫామ్లో ఉన్న ఇషాన్ కిషన్కు అవకాశం కల్పించారు. సంజు శాంసన్ కూడా వికెట్ కీపర్గా జట్టులో కొనసాగుతున్నాడు. టీ20 జట్టుకు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్గా కొనసాగనుండగా, అక్షర్ పటేల్ను వైస్ కెప్టెన్గా నియమించారు. హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, తిలక్ వర్మ, అభిషేక్ శర్మ వంటి ఆల్రౌండర్లతో టీమిండియా స్క్వాడ్ చాలా బలంగా ఉంది.
బౌలింగ్ విభాగంలో జస్ప్రీత్ బుమ్రా, అర్ష్దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్లతో పాటు హర్షిత్ రాణాకు కూడా చోటు లభించింది. వాషింగ్టన్ సుందర్, రింకూ సింగ్లను కూడా జట్టులో చేర్చడం విశేషం. మొత్తానికి బీసీసీఐ ప్రకటించిన టీమిండియా స్క్వాడ్తో టీ20 వరల్డ్ కప్ సందడి అప్పుడే మొదలైంది.
టీ20 వరల్డ్ కప్ 2026, న్యూజిలాండ్ టీ20 సిరీస్కు భారత జట్టు
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్ (వైస్ కెప్టెన్), జస్ప్రీత్ బుమ్రా, అర్ష్దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, సంజు శాంసన్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, ఇషాన్ కిషన్ , రింకూ సింగ్.
Latest News