|
|
by Suryaa Desk | Tue, Dec 23, 2025, 10:35 AM
AP: శ్రీసత్యసాయి జిల్లా ముత్యాలవాండ్లపల్లిలో వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకల్లో వైసీపీ కార్యకర్తలు బాణసంచా కాల్చుతూ హంగామా చేశారు. ఈ క్రమంలో, గర్భిణి సంధ్యారాణి ఇంటివద్ద పదేపదే బాణసంచా కాల్చడంతో ఆమె అభ్యంతరం చెప్పింది. దీంతో ఆగ్రహించిన వైసీపీ కార్యకర్త అజయ్ ఆమెపై దాడి చేసి, కడుపుపై తన్నాడు. బాధితురాలిని ఆసుపత్రికి తరలించగా, శిశువు కదలికలు లేవని వైద్యులు తెలిపారు. ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది.
Latest News