|
|
by Suryaa Desk | Fri, Jan 02, 2026, 01:13 PM
ఇరాన్లో తీవ్ర ఆర్థిక సంక్షోభం, ద్రవ్యోల్బణం (40 శాతం) పెరిగిపోవడం, కరెన్సీ విలువ పడిపోవడంతో జెన్ జడ్ ఆందోళనలు తీవ్రతరమయ్యాయి. దేశవ్యాప్తంగా విస్తరించిన ఈ నిరసనల్లో విద్యార్థులు పాల్గొంటున్నారు. పోలీసులు టియర్గ్యాస్లు ప్రయోగిస్తున్నా, ప్రభుత్వం చర్చలకు పిలిచినా ప్రయోజనం లేదని వార్తలు వస్తున్నాయి. సుప్రీం లీడర్ ఖమేనీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. పాశ్చాత్య దేశాల ఆంక్షలు, 2025లో ఇజ్రాయెల్తో జరిగిన యుద్ధం కూడా ఈ పరిస్థితికి కారణమని తెలుస్తోంది. విదేశీ నిఘా సంస్థల పాత్ర ఉందని ప్రభుత్వ వర్గాలు ఆరోపిస్తున్నాయి.
Latest News