ఉదయన్‌రాజే భోంస్లేకు క్షమాపణలు చెప్పిన ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్
 

by Suryaa Desk | Wed, Jan 07, 2026, 01:26 PM

ఛత్రపతి శివాజీ మహారాజ్ 13వ తరం వారసుడైన ఉదయన్‌రాజే భోంస్లేకు ప్రఖ్యాత ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్ (OUP) క్షమాపణలు తెలియజేసింది. రెండు దశాబ్దాల క్రితం తాము ప్రచురించిన ఓ పుస్తకంలో శివాజీ గురించి నిర్ధారించుకోని వ్యాఖ్యలు ఉన్నాయని అంగీకరించింది. ఈ మేరకు ఓ పత్రికలో బహిరంగ ప్రకటన జారీ చేసింది.అమెరికన్ రచయిత జేమ్స్ లైన్ రాసిన 'శివాజీ: హిందూ కింగ్ ఇన్ ఇస్లామిక్ ఇండియా' అనే పుస్తకాన్ని 2003లో ఓయూపీ ప్రచురించింది. ఈ పుస్తకంలోని 31, 33, 34, 93 పేజీలలో ఉన్న కొన్ని వ్యాఖ్యలు అవాస్తవాలని, వాటిని నిర్ధారించుకోలేదని ఓయూపీ ఇండియా తమ ప్రకటనలో అంగీకరించింది. ఈ వ్యాఖ్యల ప్రచురణ పట్ల విచారం వ్యక్తం చేస్తున్నామని, దీనివల్ల ఉదయన్‌రాజే భోంస్లేతో పాటు ప్రజలకు కలిగిన బాధకు, ఆవేదనకు క్షమాపణ కోరుతున్నామని పేర్కొంది. ఓయూపీ మాజీ మేనేజింగ్ డైరెక్టర్ సయీద్ మంజార్ ఖాన్ తరఫున ఈ క్షమాపణలు చెబుతున్నట్లు తెలిపింది.

Latest News
No better place than a full crowd of blue: Daryl Mitchell on NZ youngsters’ first cricket experience of India Sun, Jan 11, 2026, 06:30 PM
Amit Shah calls for BJP CM in Kerala, pushes big leap for party Sun, Jan 11, 2026, 06:27 PM
People of Punjab must reject politics of lies, says Haryana CM Sun, Jan 11, 2026, 06:25 PM
Pakistani police arrest Afghan journalist in Islamabad Sun, Jan 11, 2026, 05:31 PM
Pakistan needs to give fair taxation rights to states Sun, Jan 11, 2026, 05:30 PM