|
|
by Suryaa Desk | Sun, Jan 25, 2026, 08:36 PM
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నాందేడ్లోని సచ్ ఖండ్ గురుద్వారాను ఆదవారం సందర్శించారు. ప్రభుత్వ అతిథి హోదాలో మహారాష్ట్ర సర్కారు ఆయనకు స్వాగతం పలికింది. సిక్కుల గురువు శ్రీగురు తేజ్ బహదూర్ సింగ్ 350వ ఆత్మార్పణ దినోత్సవం వేడుకల్లో పవన్ పాల్గొన్నారు. ఇందులో భాగంగా గురుద్వారాను సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, ఎంపీ అశోక్ చవాన్, ఆయన కుమార్తె భోకార్ ఎమ్మెల్యే జయ చవాన్ తదితరులు గురుద్వార్ను సందర్శించినవారిలో ఉన్నారు.
Latest News