|
|
by Suryaa Desk | Mon, Jan 26, 2026, 12:46 PM
77వ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్న వేళ, ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి తన ప్రత్యేకమైన తలపాగాతో అందరి దృష్టిని ఆకర్షించారు. ప్రతి ఏటా గణతంత్ర దినోత్సవ వేడుకల్లో దేశంలోని ఏదో ఒక ప్రాంత సంస్కృతిని ప్రతిబింబించేలా తలపాగా ధరించడం మోదీకి అలవాటు. ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ, ఈసారి రాజస్థానీ శైలిని పోలిన తలపాగాలో కనిపించారు.ఢిల్లీలోని జాతీయ యుద్ధ స్మారకాన్ని సందర్శించిన ప్రధాని మోదీ, ఎరుపు రంగు టై-డై వస్త్రంపై బంగారు జరీ వర్క్తో కూడిన తలపాగాను ధరించారు. సిల్క్ బ్రోకేడ్ వస్త్రంతో తయారు చేసిన ఈ తలపాగా రాజస్థానీ హస్తకళా నైపుణ్యాన్ని గుర్తుకు తెచ్చింది. దీనికి మ్యాచింగ్గా నీలం, తెలుపు రంగుల కుర్తా-పైజామా, లేత నీలం రంగు జాకెట్ను ధరించారు.ప్రధాని మోదీ 2014లో అధికారం చేపట్టినప్పటి నుంచి గణతంత్ర దినోత్సవాల్లో విభిన్నమైన తలపాగాలు ధరించడం ఒక సంప్రదాయంగా మారింది. ఇవి కేవలం ఫ్యాషన్ కోసం కాకుండా, భారతదేశంలోని భిన్నత్వంలో ఏకత్వాన్ని, సాంస్కృతిక వైభవాన్ని చాటిచెప్పే ప్రయత్నంగా విశ్లేషకులు భావిస్తారు. గతేడాది 76వ గణతంత్ర దినోత్సవం నాడు రాజస్థాన్, గుజరాత్లలో ప్రసిద్ధి చెందిన ఎరుపు, పసుపు రంగుల బాంధేజ్ తలపాగాను ధరించారు. గతంలో ఉత్తరాఖండ్ టోపీ, బహుళవర్ణ బాంధనీ ప్రింట్లు వంటివి ధరించి వివిధ రాష్ట్రాల సంస్కృతులకు గౌరవమిచ్చారు.
Latest News