|
|
by Suryaa Desk | Tue, Jan 27, 2026, 11:11 AM
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డులో ఎలాంటి కల్తీ లేదని సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నిర్వహించిన సీబీఐ దర్యాప్తులో స్పష్టంగా తేలిన నేపథ్యంలో, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ డీసీ గోవింద రెడ్డి బద్వేల్ నియోజకవర్గం పోరుమామిళ్ల టౌన్లోని కలియుగ ప్రత్యక్ష దేవాలయం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన 101 టెంకాయలు కొట్టి తన అచంచలమైన భక్తిని, హిందూ ధర్మం పట్ల గాఢమైన గౌరవాన్ని వ్యక్తం చేశారు. తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి, జంతు కొవ్వు, ఫిష్ ఆయిల్ వాడినట్లు గతంలో రాజకీయ ప్రయోజనాల కోసం సాగించిన దుష్ప్రచారాలు పూర్తిగా అసత్యమని ఈ కార్యక్రమం ద్వారా స్పష్టమైన సందేశం ఇచ్చారు.దేవుడి పవిత్ర ప్రసాదాన్ని రాజకీయ లబ్ధి కోసం వాడకూడదని, భక్తుల విశ్వాసం ఎప్పటికీ అజేయమని, సత్యం ఎల్లప్పుడూ నిలిచే శాశ్వత సత్యమని ప్రజలకు గుర్తు చేశారు. హిందూ ధర్మం రాజకీయ ఆటబొమ్మ కాదని, పవిత్ర ప్రసాదంపై అసత్య ప్రచారం చేయడం భక్తుల విశ్వాసంతో ఆడుకోవడమేనని ఆయన వ్యాఖ్యానించారు.ఈ కార్యక్రమం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి చాపాటి నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించబడింది. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు, భక్తులు పాల్గొని, హిందూ ధర్మం, సంప్రదాయాలు, భక్తుల విశ్వాసం, ధర్మం–న్యాయం–సత్యం వంటి విలువలను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిదని బలంగా తెలియజేశారు. ఈ పూజా కార్యక్రమం ద్వారా కలియుగ ప్రత్యక్ష దేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి పవిత్రతను, భక్తుల విశ్వాసాన్ని కాపాడడంలో ఈ ఘటన ఒక ప్రతిష్టాత్మక ఉదాహరణగా నిలిచిందని పలువురు అభిప్రాయపడ్డారు.
Latest News