మంచుతో మరణించిన యజమాని మృతదేహానికి కాపలా కాసిన పెంపుడు శునకం
 

by Suryaa Desk | Tue, Jan 27, 2026, 03:21 PM

హిమాచల్ ప్రదేశ్ లోని భార్మౌర్ లో హృదయాన్ని కదలించే సంఘటన చోటుచేసుకుంది. భారీగా కురుస్తున్న మంచు వల్ల కొండ ప్రాంతాల్లో ఉంటున్న జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అత్యవసర పనిమీద పెంపుడు శునకంతో బయటకు వెళ్లిన ఓ వ్యక్తి చలికి తట్టుకోలేక మధ్యలోనే పడిపోయి కన్నుమూశాడు. యజమాని మృతదేహానికి కాపలాగా ఆ పెంపుడు శునకం అక్కడే ఉండిపోయింది. మంచు కురుస్తున్నా, చలిగాలులు వీస్తున్నా అక్కడి నుంచి అది కదలలేదు.ఆ వ్యక్తిని వెతుక్కుంటూ వెళ్లిన రెస్క్యూ సిబ్బందినీ కొంతసేపటి వరకు దగ్గరకు రానివ్వలేదు. యజమాని పట్ల ఆ మూగజీవానికి ఉన్న ప్రేమ, విశ్వాసం చూసి రెస్క్యూ సిబ్బందితో పాటు స్థానికులు కంటతడి పెట్టారు. నాలుగు రోజుల పాటు తిండి తినకుండా, అత్యంత కఠిన వాతావరణంలోనూ ఆ పిట్ బుల్ తన యజమాని మృతదేహాన్ని వదలకుండా కాపలా కాసింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చివరకు రెస్క్యూ సిబ్బంది ఆ శునకాన్ని మచ్చిక చేసుకుని మృతదేహాన్ని తరలించారు.

Latest News
Bangladesh: Political violence, attacks on journalists spike ahead of Parliamentary polls tomorrow Wed, Feb 11, 2026, 11:46 AM
Bangladesh: Political violence, attacks on journalists spike ahead of Parliamentary polls tomorrow Wed, Feb 11, 2026, 11:46 AM
T20 WC: Numbers game from Pakistan vs USA Group A match Wed, Feb 11, 2026, 11:41 AM
Partially burnt body of Patna High Court lawyer found at her Rajendra Nagar home in Bihar; probe underway Wed, Feb 11, 2026, 11:39 AM
Lok Sabha proceedings underway amid heavy Oppn sloganeering Wed, Feb 11, 2026, 11:37 AM