|
|
by Suryaa Desk | Mon, Feb 09, 2026, 03:10 PM
నిజానికి దేశంలో బీజేపీ అధికారంలోకి రావడానికి, ఆ పార్టీకి మంచి రోజులు రావడానికి కారణం ఆర్ఎస్ఎస్ అని మోహన్ భగవత్ చెప్పారు. ఈ మేరకు ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా ముంబైలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండడంతో ఆర్ఎస్ఎస్ కు అచ్ఛే దిన్ వచ్చాయన్న వ్యాఖ్యలపై భగవత్ స్పందించారు. అయోధ్యలో రామాలయం నిర్మాణం విషయంలో సంఘ్ పట్టుదలగా వ్యవహరించడం, ఈ ఉద్యమానికి సహకరించిన పార్టీలకు ప్రయోజనం కలిగిందని పేర్కొన్నారు. దీంతోపాటు స్వయంసేవకుల కఠోర శ్రమ కూడా ఉందని భగవత్ స్పష్టం చేశారు.
Latest News