|
|
by Suryaa Desk | Wed, Feb 11, 2026, 09:47 PM
థాయ్లాండ్లో దారుణం చోటుచేసుకుంది. దక్షణ థాయ్లాండ్లోని స్లోంకాలో ఓ డేకేర్ సెంటర్లో దుండుగులు విచక్షణారహితంగా కాల్పులకు తెగబడి 34 మందిని పొట్టనబెట్టుకున్నారు. మృతుల్లో 23 మంది చిన్నారులు ఉన్నట్టు గుర్తించారు. తుపాకులతో డే కేర్ స్కూల్లోకి చొరబడిన ఆగంతకులు.. కాల్పులకు పాల్పడ్డారు. దీంతో భయపడిపోయిన విద్యార్థులు, సిబ్బంది హహాకారాలు చేస్తూ బయటకు పరుగులు తీశారు. ఇందుకు సంబంధించిన విజువల్స్ ప్రస్తుతం వైరల్గా మారాయి.
హట్ యా స్కూల్లోకి బుధవారం మధ్యాహ్నం తుపాకితో 18 ఏళ్ల యువకుడు చొరబడి, కాల్పులు జరిపినట్టు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో పిల్లలు, సిబ్బంది సహా పలువురు గాయపడినట్టు తొలుత పోలీసులు ప్రకటించారు. స్థానిక కాలమానం ప్రకారం.. బుధవారం సాయంత్రం 4.45 గంటల ప్రాంతంలో జరిగినట్టు మీడియా కథనాలు వెలువరించాయి.
ఎంత మంది చనిపోయారు, ఎందరు గాయపడ్డారనేది అధికారులు ఇప్పటి వరకూ ఎలాంటి ప్రకటన చేయలేదని తెలిపాయి. నిందితుడ్ని ఖేమ్గా గుర్తించినట్టు పేర్కొన్నాయి.
ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు, భద్రతా సిబ్బంది అక్కడకు చేరుకున్నారు. అయితే, అప్పటికే నిందితుడు ఘటనా స్థలి నుంచి పరారయ్యాడని, దుండగుడు కాల్పులకు వినియోగించిన ఎం4 రైఫిల్ను అక్కడ వదిలేసినట్టు మీడియా పేర్కొంది. దుండుగుడు విచక్షణారహితంగా కాల్పులకు తెగబడటంతో బీతావాహ పరిస్థితి నెలకుంది. చిన్నారుల అరుపులు, ఆర్తనాదాలతో ఆ ప్రాంతం దద్దరిల్లింది. ఒక్క సంఘటనతో ఆ చిన్నారుల తల్లిదండ్రుల ఆశలు, కలలు కుప్ప కూలిపోయాయి. నిందితుడు ఇంతటి దారుణానికి పాల్పడటానికి కారణం ఏంటి? అనేది తెలియాల్సి ఉంది. ఈ దుర్ఘటన మరోసారి థాయ్లాండ్లో భద్రతపై ఆందోళనను రేకిత్తించింది.
ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. అయితే, గతంలోనూ ఇలాంటి ఘటనలు థాయ్లాండ్లో జరిగిన దాఖలాలు ఉన్నాయి. అక్టోబరు 2022లో ఈశాన్య థాయ్లాండ్లోని ఓ స్కూల్లోకి కత్తి, తుపాకితో మాజీ పోలీస్ అధికారి ప్రవేశించి మారణహోమానికి పాల్పడ్డాడు.