|
|
by Suryaa Desk | Thu, Feb 12, 2026, 10:24 AM
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కార్మిక చట్టాలకు నిరసనగా, దేశవ్యాప్తంగా 10 ప్రధాన కార్మిక సంఘాలు, సంయుక్త కిసాన్ మోర్చా (SKM) ఆధ్వర్యంలో నేడు భారత్ బంద్ కు పిలుపునిచ్చాయి. ఈ సమ్మె వల్ల బ్యాంకింగ్, రవాణా రంగాలపై ప్రధానంగా ప్రభావం పడనుంది. AIBEA వంటి బ్యాంక్ యూనియన్ల మద్దతుతో ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో నగదు లావాదేవీలు, చెక్కుల క్లియరెన్స్కు ఆటంకం ఏర్పడవచ్చు. ఒడిశా, కేరళ, పశ్చిమ బెంగాల్, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో బస్సు, ఆటో, ట్యాక్సీ సేవలు పాక్షికంగా నిలిచిపోనున్నాయి. కొన్ని విద్యా సంస్థలు సెలవులు ప్రకటించగా, ప్రభుత్వ కార్యాలయాల హాజరుపైనా ప్రభావం పడే అవకాశం ఉంది.ఫిబ్రవరి 12న జరిగే ఈ సమ్మెలో కనీసం 30 కోట్ల మంది ఉద్యోగులు పాల్గొంటారని ట్రేడ్ యూనియన్ల నేతలు చెబుతున్నారు. ఈ భారత్ బంద్ 600 కంటే ఎక్కువ జిల్లాల్లో ప్రజల జీవితాన్ని ప్రభావితం చేస్తుందంటున్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా రైతులు, వర్తక సంఘాలు నిరసన తెలుపుతున్నాయి. ప్రభుత్వ విధానాలు ‘కార్మిక వ్యతిరేక, రైతు వ్యతిరేక, కార్పొరేట్లకు అనుకూలంగా’ ఉన్నాయని వారు అంటున్నారు. ఈ భారత్ బంద్కు రైతు సంస్థలు, వ్యవసాయ రంగానికి చెందిన కార్మిక సంఘాలు, విద్యార్థులు, యువజన సంఘాలు, ఇతర సంఘాల మద్దతు ఉందని యూనియన్ తెలిపింది.
Latest News