|
|
by Suryaa Desk | Sat, Feb 28, 2026, 03:37 PM
మాజీ మంత్రి వై.ఎస్. వివేకానంద రెడ్డి హత్య కేసులో దాదాపు రెండేళ్ల విరామం తర్వాత మళ్లీ కదలిక వచ్చింది. సుప్రీంకోర్టు ఇటీవలి ఆదేశాల నేపథ్యంలో కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) తన దర్యాప్తును పునఃప్రారంభించింది. కడప జిల్లా పులివెందులలో శుక్రవారం పలువురిని విచారించి, హత్య జరిగిన రోజు నాటి కాల్ డేటాపై దృష్టి సారించింది.వివరాల్లోకి వెళితే, 2019 మార్చి 15న వై.ఎస్. వివేకానంద రెడ్డి పులివెందులలోని తన నివాసంలో దారుణహత్యకు గురయ్యారు. ఈ కేసు దర్యాప్తును 2020లో సీబీఐ చేపట్టింది. అయితే, గత కొంతకాలంగా దర్యాప్తులో స్తబ్ధత నెలకొంది. ఈ క్రమంలో, దర్యాప్తు పూర్తి చేయడానికి విధించిన నెల రోజుల గడువును సుప్రీంకోర్టు ఇటీవలే తొలగించి, విచారణను వేగంగా పూర్తి చేయాలని ఆదేశించింది. దీంతో సీబీఐ అధికారి రోహిత్ యాదవ్ నేతృత్వంలోని బృందం శుక్రవారం పులివెందులకు చేరుకుంది.ఈ కేసులో నిందితుడిగా ఉన్న సునీల్ యాదవ్ సోదరులైన కిరణ్కుమార్ యాదవ్, మహేంద్ర యాదవ్లను పులివెందుల పోలీస్ స్టేషన్లో సుమారు రెండు గంటల పాటు విచారించారు. హత్య జరిగిన రోజు తెల్లవారుజామున 1:42 గంటలకు కిరణ్కుమార్ యాదవ్, అర్జున్ రెడ్డికి చేసిన వాట్సాప్ కాల్పై అధికారులు ప్రధానంగా ఆరా తీసినట్లు సమాచారం. నిందితుడు సునీల్ యాదవ్ కూడా తన సోదరులతో పాటు పోలీస్ స్టేషన్కు వచ్చారు.
Latest News