|
|
by Suryaa Desk | Fri, Mar 20, 2026, 11:27 AM
AP: కృష్ణా జిల్లా మచిలీపట్నంలో పూజారి రఘు (41) ఇంట్లో అద్దెకు ఉంటున్న ఇంటర్మీడియట్ విద్యార్థినిపై అత్యాచారం జరిగిన ఘటనలో, బాలిక గర్భవతి కావడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నెల 18న ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు, విచారణ చేపట్టి నిందితుడు రఘును అదుపులోకి తీసుకుని పోక్సో కేసు నమోదు చేశారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. రఘు ఆ బాలికను ప్రలోభపెట్టి మూడుసార్లు అత్యాచారం చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
Latest News