|
|
by Suryaa Desk | Fri, Mar 27, 2026, 04:03 PM
కర్నూలు రూరల్ మండలం పంచలింగాలలో శ్రీరామనవమి సందర్భంగా శ్రీ వకోదండరామ స్వామి ఆలయంలో వేడుకలు వైభవంగా నిర్వహించారు. శుక్రవారం జరిగిన ఈ కార్యక్రమంలో కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు సతీసమేతంగా పాల్గొన్నారు. సీతారాముల కల్యాణాన్ని తిలకించిన ఎంపీ, స్వామి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. శ్రీరాముడి జీవితం ఆదర్శమని, ఆయన చూపిన ధర్మ మార్గంలో నడవాలని సూచించారు. కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
Latest News