|
|
by Suryaa Desk | Mon, Mar 30, 2026, 11:31 AM
అఫ్గానిస్థాన్లో భారీ వర్షాల కారణంగా సంభవించిన వరదలు, కొండచరియలు విరిగిపడటంతో 17 మంది మృతి చెందారు. మరో 26 మంది గాయపడ్డారు. పశ్చిమ, మధ్య, వాయువ్య ప్రాంతాల్లోని 34 ప్రావిన్సులు ప్రభావితమయ్యాయి. 147 ఇళ్లు ధ్వంసం కాగా, 80 కిలోమీటర్ల మేర రోడ్లు కొట్టుకుపోయాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. రాబోయే రోజుల్లో మరిన్ని వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. సరైన మౌలిక సదుపాయాలు లేకపోవడం, మట్టి ఇళ్లు నష్ట తీవ్రతను పెంచుతున్నాయి.
Latest News