|
|
by Suryaa Desk | Tue, Apr 14, 2026, 02:45 PM
AP: రాష్ట్ర కూటమి ప్రభుత్వం పేదల ఆకలి తీర్చేందుకు మరో కీలక అడుగు వేసింది. అధికారంలోకి వచ్చిన వెంటనే అన్న క్యాంటీన్లను తిరిగి ప్రారంభించిన ప్రభుత్వం, ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో కూడా వీటిని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఏప్రిల్ 15వ తేదీన కొత్తగా నిర్మించిన 62 అన్న క్యాంటీన్లను సీఎం చంద్రబాబు ధరణికోటలో ప్రారంభిస్తారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం అన్న క్యాంటీన్ల సంఖ్య 269కి చేరుతుంది. ఈ క్యాంటీన్లలో కేవలం 5 రూపాయలకే నాణ్యమైన టిఫిన్, భోజనం అందిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని కూలీలు, పేదలు, ప్రయాణికులకు ఈ కొత్త క్యాంటీన్లు ఎంతో ఊరటనివ్వనున్నాయి.
Latest News